Posts

Showing posts from June, 2021

టీపీసీసీ అధ్యక్షుడి గా రేవంత్ రెడ్డి

Image
త్వరలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గా కోమటిరెడ్డి !? పిసిసి అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు,ప్రచారకమిటీ,ఏఐసీసీ వ్యవహారాల కమిటీ నేతలను నియమించిన సోనియాగాంధీ ఐదుగురు వర్కింగ్ ప్రసిడెంట్స్ నియమించిన సోనియాగాంధీ 10 మందిని సీనియర్ ఉపాధ్యక్షులుగా నియామకం ప్రచార కమిటీ చైర్మన్ గా మధు యాష్కీ గౌడ్,కన్వీనర్ గాసయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ నియామకం  తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పది మందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించింది. కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబాని, దామోదర్‌ రెడ్డి, మల్లు రవి, పోడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌ రెడ్డి, రాజేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, జావీద్‌ అమీర్‌ నియమితులయ్యారు. కోమటి రెడ్డిని ఏఐసిసి లోకి తీసుకునే చాన్స్.. ఆమేరకు కోమటి రెడ్డికి హామీ ఇచ్చిన అధిష్టానం..! మిగతా సీనియర్లకు భవిష్యత్ లో కీలక పోస్టుల్ల...

క్యాస్టింగ్ కౌచ్ 14 మంది పేర్లు బయటపెట్టిన కేరళ నటి

Image
Actress revathi sampath sensation in koliwood క్యాస్టింగ్‌ కౌచ్‌ కొంతకాలంగా సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. వేధింపులకు గురైన కొందరు తారలు ‘మీటూ’ ఉద్యమంతో బయటికొచ్చి తమ సమస్య లను బయటపెట్టారు. తాజాగా మలయాళ నటి రేవతి సంపత్‌ నోరు విప్పారు. తనని వేధించిన 14 మంది పేర్లను ఫొటోలతో సహా ఫేస్‌బుక్‌ వేదికగా బయటపెట్టారు. ఇందులో పాపులర్‌ ఆర్టిస్ట్‌ సిద్ధిక్‌, దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌, ఓ డాక్టర్‌, సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ కూడా ఉన్నారని వెల్లడించింది. ‘‘ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను ఓ అడుగు కూడా వెనక్కి వేయను’’ అని రేవతి తెలిపారు. #revathisampath #koliwood #castingcouch  1 .  రాజేశ్‌ టచ్‌రివర్‌  (దర్శకుడు) 2. సిద్ధిక్‌ (నటుడు) 3. ఆషికి మహి(ఫొటోగ్రాఫర్‌) 4. సిజ్జు (నటుడు) 5. అభిల్‌ దేవ్‌ (కేరళ ఫ్యాషన్‌ లీగ్‌ ఫౌండర్‌) 6. అజయ్‌ ప్రభాకర్‌ (డాక్టర్‌) 7. ఎంఎస్‌ పదూష్‌ (అబ్యూసర్‌) 8. సౌరబ్‌ కృష్ణన్‌ (సైబర్‌ బల్లీ) 9. నందు అశోకన్‌ (డివైఎఫ్‌ఐ కమిటీ మెంబర్‌) 10. మాక్స్‌వెల్‌ జోస్‌ (షార్ట్...

50 లక్షలు ఖర్చు చేసినా దక్కని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం

Image
Pathitic death for US return software engineer పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన నరిష్మరెడ్డి కరోనా బారిన పడిన వైనం వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపై పడటంతో కన్నుమూత పెళ్లి చేసుకుని, కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జీవితాన్ని కరోనా వైరస్ చిదిమేసింది. కరోనా మహమ్మారి ఆ యువతి ప్రాణాలు తీసింది. 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన పెండ్యాల రవీందర్ రెడ్డి కుమార్తె నరిష్మరెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఏడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. పెళ్లి చేసుకోవడానికి సొంతూరుకు తిరిగొచ్చింది. మే నెలలో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే అంతలోనే ఆమెకు కరోనా సోకింది. కరోనాకు చికిత్స తీసుకుని ఆమె కోలుకుంది. అయితే, కరోనా ప్రభావం ఆమె ఊపిరితిత్తులపై పడింది. దీంతో, ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చివరకు కన్నుమూసింది. చికిత్స కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ అమ్మాయి ప్రాణం దక్కలేదని ఆమె కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ లో కర్ఫ్యూ వేళల్లో మార్పు సాయంత్రం 6 వరకు సడలింపు

Image
Ap government relaxes curfew timings  కోవిడ్‌పై సీఎం సమీక్షా సమావేశంలో సీఎం కీలక నిర్ణయం రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల సడలింపు* ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ సడలింపు జూన్‌ 20 తర్వాత నుంచి అమలు సా.5 గంటలు కల్లా దుకాణాలు మూసివేయాలి సా. 6 గంటలనుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమల తూ.గో. జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ సడలింపు* కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపు  ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్‌ టైమింగ్స్‌ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు కోవిడ్‌పై సీఎం సమీక్షా సమావేశంలో సీఎం నిర్ణయం

ఇక మండలి లో తిరుగులేని శక్తి గా వైసీపీ!

Image
7 tdp mlcs retirement today  రాష్ట్ర శాసన మండలిలో ఎనిమిది మంది సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. సభ్యుల్లో ఏడుగురు టీడీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, జగదీశ్వర్ రావు, వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల బలం 21కి పెరగనుండగా...టీడీపీ సభ్యుల సంఖ్య 15కు తగ్గనుంది. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్తగా ఎన్నికైన మోషేన్ రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), రమేష్ కుమార్ (కడప) కొత్త ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. వీరి తో కలిపి బలం 21కి చేరుకుంది 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో గ్యాస్ లీకేజ్ .

Image
Gas leakage in RGIA shamshabad Hyderabad  గ్యాస్ పైప్ లికేజి కావడంతో ఊపిరి అడక స్పృహతప్పి పడిపోయిన ముగ్గురు హుటా హుటీన ఎయిర్ పోర్ట్ లోని అపోలో ఆస్పత్రికి తరలించిన ఆధికారులు. చికిత్స పొందుతూ నర్సహ్మ రెడ్డి మృతి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విషాదం. డ్రైనేజి పనులు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు నర్సింహారెడ్డి మృతి. ఇలియస్,జకీర్ లు చికిత్స పొందుతున్నారు బెల్ట్ 4 లో డ్రైనేజి పనుల కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు. డ్రైనేజి పైప్ బ్లాక్ కావడం తో యాసిడ్ పోయడంతో స్పృహ కోల్పోయిన ముగ్గురు. శ్వాస తీసుకోవడం ఇబ్బది కావడం తో మృతి చెందిన నర్సింహారెడ్డి నర్సింహారెడ్డి డెడ్ బాడీ ని గాంధి కి తరలించిన పోలీసులు.

తెలంగాణ లో 19 నుంచి నైట్ కర్ఫ్యూ! జూలై 1 నుంచి బార్లు థియేటర్స్

Image
Bars theaters opens likely from july 1st ఈనెల 19వ తేదీ తరవాత రాష్ట్రంలో కోవిడ్‌ ఆంక్షలను సడలించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. వారం నుంచి పది రోజుల పాటు రాత్రి కర్ఫ్యూఊ విధించాలని భావిస్తోంది. అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తారు. వచ్చే నెల నుంచి బార్లు, సినిమా థియేటర్లు, జిమ్‌కు 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా కేసుల, మరణాలు గణనీయంగా తగ్గినందున ప్రభుత్వం అన్‌లాక్‌ దిశగా ఆలోచిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో పాజటివ్‌ రేటు 1.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షలను సడలించక తప్పడం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

అశోక్ గజపతి రాజు కు హైకోర్టు లో ఊరట! మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ఆయనే అంటూ ఆదేశాలు

Image
BIG SHOCK TO SAMCHAIYUTA GAJAPATI RAJU  అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను కొట్టివేసిన హైకోర్టు వరహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్ కు ఆయనే చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు గతంలో మానస ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించిన ప్రభుత్వం ఆ స్థానంలో సంచయితను నియమిస్తూ 72 జీవోను విడుదల చేసిన ప్రభుత్వం సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలతో మానస ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గజపతి రాజు #ashokgajapatiraju #samchaiyuta #mansastrust #simhachalam #trustboard

వైసీపీ లో నామినేటెడ్ పదవులు వీరికే! త్వరలో ప్రకటన

Image
70 corporations 840 directors ycp nominated posts ఏపీలో భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు దాదాపు పూర్తయింది. కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు వివిధ విభాగాలకు డైరెక్టర్లు, ఇతర పోస్టులు కలిపి.. ఒకేసారి దాదాపు వెయ్యి పదవులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో భాగంగా.. దాదాపు 70 కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవులు, ఆయా కార్పొరేషన్లలో.. మరో 840 డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు .పదవుల పంపకాలను.. 3 దశలుగా విభజించారు. మొదటి ప్రాధాన్యతగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వారికి కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు ఇవ్వబోతున్నారు. తర్వాత గత ఎన్నికల టైంలో.. చివరి నిమిషంలో టికెట్ త్యాగం చేసిన వారికి కూడా ఈసారి అవకాశం కల్పించబోతున్నారు. చివరగా.. పార్టీలో సీనియర్లుగా ఉంటూ.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి.. ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  రెండేళ్లుగా.. నామినేటెడ్ పోస్టుల కోసం పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. దీంతో.. అర్హులైన వారికి పదవులు వచ్చేలా కసరత్తు చేస్తున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చి.. రెండేళ్లైనా కొన్ని నామినేటెడ్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మిగతావన్నీ..అలాగే ...

శ్రీవారి సేవ లో సుప్రీం సీజె ఎన్.వి రమణ

Image
Cji nv ramana visited tirumala  ఉదయం తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులు..  తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్ద కు చేరుకున్న గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్. ఎన్.వి. రమణ దంపతులకు తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్ గౌ. వై.వి. సుబ్బారెడ్డి, , టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి,  స్వాగతం పలుకగా ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదం తో ఆల యం లోకి వెళ్లి శ్రీవారిని దర్శించు కున్నారు.. శ్రీ వారి దర్శనానంతరం రంగ నాయకుల మండపం లో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.. #cji #nvramana #ttd #tirumala  అనంతరం గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ దంపతులు బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు...

టీఆర్ఎస్ ఎంపీ నామా ఇళ్ల పై ఈడీ దాడులు

Image
ED RAIDS ON TRS KHAMMAM MP NAMA ఖమ్మం టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర రావు నివాసంతోపాటు ఆఫీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇవాళ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. రాంచి ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇళ్ళపై కూడా దాడులు జరుగుతున్నాయి. బ్యాంకుల నుంచి ఈ కంపెనీ రూ. 1,064 కోట్ల రుణాలు తీసుకుని.. ఎగ్గొట్టిందని 2019లో సీబీఐకిబ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు 2020లో కంపెనీపై సీబీఐ చార్జిషీటు దాఖలైంది. ఈ చార్జిషీటు ఆధారంగా ఈడీ కేసును విచారిస్తోంది. హైదరాబాద్‌లోని మధుకాన్‌ ఇన్‌ఫ్రా ఆఫీస్‌తో పాటు ఆయన ఇంటిపై కూడా సోదాలు జరుగుతున్నాయి. రాంచి ఎక్స్‌ప్రెస్‌ వే కంపెనీ డైరెక్టర్లు కె శ్రీనివాసరావు, ఎన్‌ సీతయ్య, ఎన్‌ పృథ్వితేజ నివాసాలపై కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కంపెనీ తీసుకున్న రుణాలకు నామా నాగేశ్వరరావు వ్యక్తిగత పూచి ఇచ్చారు. #khamnammp #madhukon #namanageswararao #edraids #pruthvirajanama నామా పృథ్వి తేజ ఆయన కుమారుడు. మనీలాండరింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

టీఆర్ఎస్ లోకి ఎల్ రమణ! రేపో మాపో టీడీపీ కి గుడ్ బై?

Image
Ttdp president L. Ramana will join in trs  15:20 June 07 పార్టీ వీడే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ హుజూరాబాద్ ఉపఎన్నిక ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బీసీ నేతకోసం తెరాస పావులు తెలుగుదేశంను వీడే యోచనలో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణకు తెరాస ఆహ్వానం తెరాసలో చేరే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఎల్.రమణకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు తెరాస వర్గాల సమాచారం ఎల్‌.రమణతో సంప్రదింపులు జరుపుతున్న మంత్రి ఎర్రబెల్లి  తెరాసలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోని ఎల్‌.రమణ భాజపా నుంచి కూడా ఆహ్వానం ఉన్నట్టు తెలిపిన ఎల్.రమణ  

ఈ నెల 13న బీజేపీ లోకి ఈటెల 17న కోమటి రెడ్డి

Image
Eetela will joins on 13th. Komatireddy soon డీకే అరుణ తో భేటి ఐన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..  నాలుగు గంటల పాటు సుదీర్ఘ భేటి..  బీజేపీ లోకి రావాలని ఆహ్వానిచ్చిన డీకే అరుణ.  ఈనెల 11 తేదీన ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నేతలను కలిసే అవకాశం.. ఈటెల బీజేపీ లోకి చేరికకు ముహూర్తం ఖరారు ఈనెల 13న కాషాయ కండువా కప్పుకొనున్న ఈటల  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సమయం తీసుకున్న బండి సంజయ్ ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ తో పాటు బీజేపీలోకి ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు

మే నెల లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు

Image
1 lakh GST collection in month of may వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ళు వరుసగా ఎనిమిదో నెల రూ.1 లక్ష కోట్లు దాటాయి.  అయితే ఏప్రిల్ తో పోల్చితే ఇది 41 వేల కోట్లు తక్కువ.  ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 మే నెలలో జీఎస్‌టీ రెవిన్యూ వసూళ్ళు రూ.1,02,709 కోట్లు. ఈ విధంగా నెలకు రూ.1 లక్ష కోట్లు పైబడి వసూలు కావడం వరుసగా ఇది ఎనిమిద వ సారి.. జూన్  4 వరకు వసూలైన జీఎస్‌టీ పైన పేర్కొన్న మొత్తంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్-19 రెండో ప్రభంజనం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కొన్ని రకాల మినహాయింపులు ఇచ్చిన సంగతిని గుర్తు చేసింది.  అయితే మంత్-ఆన్-మంత్ బేసిస్‌లో చూసినపుడు మే నెలలో జీఎస్‌టీ రెవిన్యూ వసూళ్ళు క్షీణించినట్లు తెలిపింది. ఏప్రిల్‌లో ఇది రికార్డు స్థాయిలో రూ.1.41 లక్షల కోట్లు అని వివరించింది . మే నెలలో వసూలైన ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.53,199 కోట్లు; దీనిలో సరుకు దిగుమతులపై వసూలు చేసిన రూ.26,002 కోట్లు ఉంది. సెంట్రల్ జీఎస్‌టీ రూ.17,592 కోట్లు. కాగా స్టేట్ జీఎస్‌టీ రూ.22,653 కోట్లు వసూలైనట్లు వివరించింది. కోవిడ్-19 మహ...

Allow ap advocates telangana HC orders

Image
ఏపీ, ఇతర రాష్ట్రాల న్యాయవాదులను అడ్డుకోకండి : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు  లాక్ డౌన్  వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది ఇచ్చిన సర్టిఫికెట్‌ ఉంటే వారి క్లర్కులు, స్టెనోలను కూడా అనుమతించాలని సూచించింది. లాక్‌డౌన్‌ సమయంలో న్యాయవాదులు బార్‌ కౌన్సిల్‌ గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి న్యాయవాదుల రాకపోకలను అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. న్యాయవాదులు, క్లర్కులు కోర్టు ఆదేశాలను దుర్వినియోగం చేయొద్దని ఉన్నతన్యాయస్థానం సూచించింది. గుర్తింపు కార్డు చూపినా న్యాయవాదులను అవమానిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈమేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. #apadvocates #tshighcourt #lockdown న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.

Jagan cabinate expansion likely in november! 7 ministers continue

Image
ఆ ఏడుగురు సేఫ్ .. మిగతా మంత్రులపై నిర్ణయం! నవంబర్ లో జగన్ క్యాబినెట్ విస్తరణ ఏపీలో క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోందా.. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే వైసీపీలోనూ ముఖ్యంగా ఎమ్మెల్యేల్లో కొత్త మంత్రులుగా ఎవరు ఉంటారనేదానిపై చర్చ మొదలైంది... అయితే 151 సీట్ల బంపర్ మెజార్టీ తో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి .. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే గెలిచిన ఎమ్మెల్యేలతో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.. అందులో మంత్రి వర్గం కూర్పుపై స్ట్రైయిట్ గా క్లారిటీ ఇచ్చేశారు... తొలివిడతలో కొందరిని మంత్రులుగా తీసుకుంటున్నాను.. వీళ్లు మొదటి రెండున్నరేళ్లు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తారు... మళ్లీ అప్పుడు విస్తరణ జరిపి మిగతా రెండున్నరేళ్లకు కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని చెప్పారు... ఇలా అయితే దాదాపు అందరికి అన్ని సామాజికవర్గాలకు అవకాశం కల్పించినట్లవుతుందని ఉన్నదిఉన్నట్లుగా జగన్ చెప్పేశారు.. ఈ ఏడాది మే 30తో సీఎంగా ఆయన రెండేళ్లు పూర్తి చేసుకున్నారు.. ఆయన చెప్పిన మాట ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ లోనే విస్తరణ ఉంటుంది.. దీంతో జిల్లాల్లో అప్పుడే కొత్త మంత్రులు ఎవరనేదానిపై చర్చ...

మాజీ ఎంపీ మాగంటి రెండో కుమారుడు మృతి

Image
Eluru Ex mp maganti 2nd son dead 3 నెలల క్రితమే మొదటి తనయుడు మరణం ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) మృతి  తాగుడు అలవాటును తప్పించడానికి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ మద్యానికి బానిస అయిన రవీంద్ర ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించిన కుటుంబ సభ్యులు  ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చి ఓ హోటల్ లో ఉన్న రవీంద్ర బ్లడ్ వామిటింగ్ తో  హయత్ ప్యాలెస్ లో చనిపోయిన రవీంద్ర.. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు #Maganti #eluruexmp #sondead మూడు నెలల్లో మాగంటి ఇద్దరి కుమారులు మృతి చెందారు..