Posts

Showing posts from May, 2021

కిలో బంగారు మంగళ సూత్రం!

Image
One kilo gold mangalsutra  పెళ్లైన హిందూ మహిళలు మంగళసూత్రం ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ తాహతును బట్టి తులమో.. 5 తులాలో.. మరీ డబ్బులు ఎక్కువగా ఉంటే 10 తులాలబంగారు మంగళసూత్రాన్ని చేయించుకుని మెడలో వేసుకుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు ఏకంగా కేజీ బంగారంతో తయారుచేయించిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. దాన్ని ఆ మహిళ మెడలో ధరించి వీడియో తీసుకోగా.. అది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  మహారాష్ట్రలోని బివాండీకి చెందిన బాలా అనే వ్యక్తి తన భార్యకు కేజీ బంగారంతో తయారుచేసిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. మోకాళ్ల వరకు పొడవున్న ఆ బంగారు మంగళసూత్రాన్ని ధరించి ఆమె, భర్తతో కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు బాలాను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అతడు చెప్పిన విషయం విని అంతా షాకయ్యారు. తన భార్యకు కానుకగా ఇచ్చిన మంగళసూత్రం గిల్టుదని, దాన్ని ఓ బంగారు షాపు నుంచి రూ.38వేలకు కొన్నట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. బంగారు షాపు నిర్వాహకులను విచారించగా...

సినిమా రంగానికి చంద్రమోహన్ గుడ్ బై

Image
Chandramohan goodbye to industry  నిన్నటితో 81 ఏట అడుగుపెట్టిన నటుడు చంద్రమోహన్ ఇక సినిమాలకు స్వస్తిపలికారు! 55 ఏళ్ళు నటించానని, రాఖీ సినిమా షూటింగ్లో గుండెనొప్పి రావడంతో బైపాస్ సర్జరీ జరిగిందని, దువ్వాడ జగన్నాధం షూటింగ్లో కూడా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డానని అయన గుర్తు చేసుకున్నారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్, శ్రీమతి శారద ఆకునూరి సంయుక్త ఆధ్వర్యంలో శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు ఆధ్వర్యంలో జూమ్లో ఈనెల 22 నుంచి రెండు రోజులపాటు చంద్రమోహన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 14 దేశాల నుంచి 108 మంది రచయితలు పాల్గొని, చంద్రమోహన్ నటించిన 108 సినిమాల గురించి, వారి నటనా వైదుష్యం గురించి విశ్లేషించారు. #chandramohan #senioractor #filmindustry #adisangathi 

గూగుల్ పే ద్వారా అమెరికా నుంచి భారత్ కు ఈజీగా మనీ ట్రాన్స్ ఫర్.

Image
Easy Money transfer through google pay from US to India  గూగుల్ పే యాప్‌ వినియోగ‌దారులు ఇక నుంచి అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ యూజ‌ర్ల‌కు డ‌బ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ క‌ల్పించింది. ఈ మేర‌కు యూజ‌ర్ల‌కు ఈ స‌దుపాయాలు క‌ల్పించేందుకు ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న‌ట్లు టెక్‌క్రంచ్ మొద‌ట ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అనంత‌రం గూగుల్ పే కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది. అంతేగాక‌, ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్ తో న‌గ‌దు బ‌దిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేప‌థ్యంలో ఇక‌పై అమెరికా యూజ‌ర్లు మ‌రో 200 దేశాల‌కు, వైజ్ ద్వారా 80 దేశాల‌కు డ‌బ్బు పంపే సౌక‌ర్యాలు కూడా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గూగుల్ పే చెప్పింది. #googlepay #US #India #money transfer

తెలంగాణ లాక్ డౌన్ నుంచి వీటికి మినహాయింపు!

Image
 EXCEPTIONS FROM LOCKDOWN - మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి..  10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని! క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది.  - మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. -  : లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు : - వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.  - తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.  - వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడిక...

తెలంగాణ లో రేపటి నుంచే లాక్ డౌన్! BIG BREAKING!

Image
Lock down in telangana from 2mrw తెలంగాణ లో లాక్ డౌన్ ఉంటుందని ముందే చెప్పిన "adisangathi" మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. #lockdown #kcr #telangana #adisangathi 

తెలంగాణ లో ఈ నెల 16 నుంచి లాక్ డౌన్!!

Image
Lock down in telangana from 16th may to 31st may!? ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు  క్యాబినెట్ సమావేశం జరగనున్నది.  రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్  విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 16 నుంచి 31 వరకు లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందంటున్నారు..  కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గుతలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్  కావాలని కోరుకుంటున్నపరిస్థితి కూడా వున్నది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియమీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై క్యాబినెట్  చర్చించి  నిర్ణయం తీసుకోనున్నది. #lockdown #telangana #kcr 

జూన్ 23 న కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు

Image
New AICC president election on 23 rd june  కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎంపికకు ముహూర్తం ఖరారు జూన్ 23 న ఎన్నిక ప్రక్రియ ద్వారా నూతన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక చెయాలని నిర్ణయించిన సిడబ్ల్యుసి సిడబ్ల్యుసి సమావేశంలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు ప‌శ్చిమ బెంగాల్, కేర‌ళ‌, అసోం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఫ‌లితాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సోనియాగాంధీ  ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బలను గమనించి పార్టీని చక్కదిద్దుకోవాలి నిరుత్సాహ‌పూరిత‌మైన ఎన్నికల ఫ‌లితాల‌లో మన లోటుపాట్ల‌ను సరిదిద్దుకోవాలి కేర‌ళ‌, అసోం రాష్ట్రాల్లో ప్ర‌స్తుత ప్ర‌భుత్వాల‌ను కాంగ్రెస్ ఎందుకు గ‌ద్దె దింప‌లేక‌పోయిందో స‌మీక్షించాల్సిన అవ‌స‌రం ఉంది. ప‌శ్చిమ బెంగాల్లో పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందో ఆత్మ ప‌రిశీలన చేసుకోవాలి ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై నేతలను వివరణ కొరిన సోనియాగాంధీ ఊహించిన దానికంటే పేలవమైన ఫలితాలు ఎందుకు వచ్చాయో చెప్పాలని పార్టీ నేతలను కోరిన సోనియాగాంధీ  ఓటమికి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్న సోనియాగాంధీ ఎన్నికల ఫ‌లితాల‌ను వాస్త‌విక కోణంలో మ‌నం చూడ‌నిప‌క్షంలో వీటి నుంచి ...

కరోనా తో సీనియర్ జర్నలిస్ట్ ఆర్ కే మృతి

Image
సీనియర్ జర్నలిస్ట్ ఆర్ కే కరోనా తో మృతి  జర్నలిస్టు మిత్రులకు ఆర్‌కెగా సుపరిచితుడైన భళ్ళమూడి రామకృష్ణ ఇవాళ ఉదయం కన్ను మూశారు. కరనా సోకడంతో సోమవారం గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ,ఎన్‌టీవీలతో డెక్కన్‌ క్రానికల్‌లో ఆయన పనిచేశారు. ఆర్ కే స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి 

Congress upperhands in Karnataka local body elections

Image
కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ.. కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం* 120 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగైన ఫలితాలు రాబట్టిన జేడీఎస్‌ సీఎం యడియూరప్ప సొంత జిల్లాలోనూ బీజేపీకి ఎదురుగాలి మడికెరె నగరసభ కైవసం చేసుకున్న బీజేపీ కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 8 జిల్లాల్లోని 10 స్థానిక సంస్థల్లో 263 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 120 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆశ్చర్యకరంగా బీజేపీ కంటే జేడీఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ 57 స్థానాలకే పరిమితం కాగా, జేడీఎస్ 66 స్థానాల్లో విజయం సాధించింది. బళ్లారి కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 39 వార్డుల్లో 20 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 14 చోట్ల, ఇతరులు ఐదు చోట్ల గెలుపొందారు. బీదర్‌లో హంగ్ ఏర్పడింది. అయితే, 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8, జేడీఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ ఒక స్థానంలో విజయం సాధించింది. రామ...