Posts

Showing posts from September, 2021

జనసేన సంచలనం! అభ్యర్థి లేకుండానే గెలుపు

Image
పశ్చిమ గోదావరి లో జనసేన సంచలనం! #janasena #apparishatpolls #pavankalyan  పశ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలన విజయం నమోదు చేసుకుంది. పెంటపాడు మండలం రావిపాడు ఎంపీటీసీ పదవి వద్దన్నా పార్టీని వీడిన వ్యక్తినే వరించింది. అక్కడ ఉన్న ఒక్క నేత అధికార వైసీపీలోకి జంప్ అయ్యాడు. అధికార పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని మరీ ప్రచారం చేశాడు. అభ్యర్ధి లేకపోయినా జనసేనను గెలిపించుకుందామని కార్యకర్తలు శ్రమించారు. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో ఫలితం చూసి అందరు ఖంగుతిన్నారు. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ఓట్లు లెక్కించడంతో జనసేన పార్టీ అనూహ్య విజయం సాధించింది. పార్టీని వదిలి వెళ్లిన జనసేన నాయకుడు బొచ్చెల తాతారావు గెలుపొందాడు.

సైదాబాద్ కిల్లర్ ఆత్మహత్య!

Image
Saidabadgirlkiller commits sucide  చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై  రాజు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న టాటూ ఆధారంగా అతడు హత్యాచార నిందితుడు రాజు అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆరోజు ఏం జరిగిందంటే.. ఈ నెల 9వ తేదీన రాజు మాదన్నపేటలో  భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. పొద్దున 9 గంటలకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తన గదికి తిరిగొచ్చాడు. సాయంత్రం 4.30-5 గంటల మధ్యలో చిన్నారికి మాయ మాటలు చెప్పి తన రూమ్‌కు తీసుకొచ్చి లైంగికదాడి జరిపాడు. ఆమె అరుస్తుంటే గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గదికి తాళం వేసి బయటకు వచ్చిన రాజు.. తాగిన మైకంలో అదే ప్రాంతంలో తచ్చాడాడు. సాయంత్రం 7గంటలకు స్థానికంగా ఉన్న పానీపూరి బండి వద్ద పానీ పూరి తిన్నాడు. అప్పటికే సింగరేణి కాలనీ వాసులందరూ పాప కోసం వెతుకుతున్నారు. రాత్రి 9 గంటలకు చిన్నారి నాయనమ్మను చూసిన రాజు.. పాప కనిపించిం...

గుజరాత్ సీఎం రూపాని రాజీనామా

Gujarat CM Resigned…!! గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తన ముఖ్య మంత్రి పదవికి శనివారం రాజీ నామా చేశారు. వచ్చే ఏడాది గుజరాత్లో జరిగే శాసనసభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్లు విశ్వ సనీయ సమాచారం . గుజరాత్లో పట్టు ఉన్న పటేల్ వర్గానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. ఇప్ప టికే కర్ణాటక ,ఉత్తరఖండ్ ముఖ్యమంత్రులను మార్చి అక్కడ రెండు రాష్ట్రాల్లోనూ తన ముఖ్యమంత్రులను మార్చింది.. ప్రధాని నరేంద్రమో దీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ రాజకీయాల్లో కీలక పరిణా మాలు చోటుచేసు కున్నాయి . ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు కు రాజీనామా సమ ర్పించారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేడు బీజేపీ పార్టీలో కూడా కొనసా గుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తన ముఖ్య మంత్రి పదవికి శనివారం రాజీ నామా చేశారు. వచ్చే ఏడాది గుజరాత్లో జరి...

ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు_

ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు_ * ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరట కల్పించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలు చేయడానికి  డిసెంబర్‌ 31వ తేదీ వరకు  అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది. కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, ఐటీ రిటర్నుల దాఖలు కోసం ఇన్ఫోసిస్‌ సంస్థ రూపొందించిన కొత్త వెబ్‌సైట్‌లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాని నేపథ్యంలో సెప్టెంబరు 30 వరకు ఉన్న ఈ గడువును డిసెంబర్‌ 31 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం._ _ఈ ఏడాది జూన్‌ 7న ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్‌  ( www.incometax.gov.in)ను ఇన్ఫోసిస్‌ సాంకేతిక సహకారంతో అందుబాటులోకి తీసుకురాగా.. అప్పటి నుంచి సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించిన చేసిన ఇన్ఫోసిస్‌కు కేంద్రం డెడ్‌లైన్‌ విధించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం ఇన్ఫోసిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సలీల్‌ పరేఖ్‌ భేటీ సందర్భంగ...

ఆధార్‌’లో ఇకపై ‘తండ్రి పేరు‘, ‘భర్త పేరు’ ఉండదు.

New changes in aadhaar  దేశంలోని పౌరుల దగ్గర ఉండాల్సిన అతి ముఖ్యమైన ధ్రువపత్రాలలో ఒకటైన ఆధార్ కార్డులో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇకపై మీరు ఆధార్ కార్డును అప్‌డేట్ చేస్తే, దానిలో ‘తండ్రి పేరు‘, ‘భర్త పేరు’ ఉండదు. అంటే కార్డుదారుని బంధుత్వం దానిలో వెల్లడికాదు. అది గుర్తింపు రూపంలో మాత్రమే ఉంటుంది. ఆధార్ కార్డులో ఇకపై తండ్రి లేదా భర్త పేరు దగ్గర కేరాఫ్ అని ఉంటుంది. ఇటీవల ఒక దరఖాస్తుదారు తన చిరునామా మార్పు చేస్తూ, తన కుటుంబానికి సంబంధించిన ఆధార్ కార్డులను అప్‌డేట్ చేశాడు. అయితే దీనిలో తండ్రి పేరు ఉండాల్సిన చోట కేరాఫ్ అని ఉంది.  పొరపాటు జరిగిందని భావించిన అతను ఆధార్ కేంద్రానికి విషయం తెలియజేశారు. అయితే ఇకపై ‘తండ్రి పేరు‘, ‘భర్త పేరు’ స్థానంలో కేరాఫ్ అని ఉంటుందని అక్కడి సిబ్బంది తెలిపారు. ఈ మార్పు గురించి కామన్ సర్వీస్ సెంటర్ అధీకృత మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ త్యాగి మాట్లడుతూ ఇకపై ఆధార్ కార్డులో తండ్రి, కొడుకు, కుమార్తెకు బదులుగా ‘కేరాఫ్’ అని ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారు కూడా ‘కేరాఫ్’ లో సంబంధాన్ని తెలియజేయకుండా కేవలం పేరు రాస్తే సరిపోతుందన్నారు. ఈ విధంగా ఆధార్ అప్‌డేట్ ...