ఏప్రిల్ 8న జెడ్పి ఎన్నికలు. కొత్త సీఈసీ గ్రీన్ సిగ్నల్
ఏపీ లో ఏప్రిల్ 8న జెడ్పి ఎన్నికలు. ఇప్పటికే 126 ఏకగ్రీవం!
*ఏప్రియల్ 8 న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు...10 న కౌంటింగ్*
*నూతన ఎస్ఇసి గా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే జెడ్పీ ఎన్నికలపై కసరత్తులు పూర్తి చేసిన నీలం సాహ్ని*
*న్యాయపరమైన చిక్కులు కూడా తొలగడంతో నోటిఫికేషన్ విడుదల*
*హైకోర్టు ఆదేశాలు నేపధ్యంలో ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం*
*నూతన ఎస్ ఇసి నీలంసాహ్నిని కలిసి ఎన్నికల జెడ్పి నోటిఫికేషన్ పై చర్చించిన సిఎస్ ఆదిత్యనాద్ దాస్*
*జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జెడ్పి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తెలుసుకున్న ఎస్ఇసి*
*ఎన్నికల నిర్వహణకి సంసిద్దత వ్యక్తం చేయడంతో నోటిఫికేషన్ జారీ*
*అభ్యర్ధులు మరణించిన స్ధానాలను మినహాయించి మిగిలిన స్ధానాలలో ఎన్నికలకి నోటిఫికేషన్*
*గత ఏడాది మార్చ్ 15 కరోనా కారణంగా జెడ్పి ఎన్నికలు వాయిదా*
*వాయిదా పడే సమయానికి నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి అయిన వైనం*
*రాష్ట్ర వ్యాప్తంగా 660 జెట్పిటిసి స్ధానాలకి నోటిఫికేషన్*
*8 జెడ్పిటిసి స్ధానాలకి కోర్టు వివాదాలతో ఆగిన ప్రక్రియ*
*మిగిలిన 652 జెడ్పిటిసి స్ధానాలకి 126 జెడ్పిటిసిలు వైఎస్సార్ సిపి ఏకగ్రీవం*
*13 మంది జెడ్పిటిసి అభ్యర్ధులు మృతి*
*మిగిలిన 513 జెడ్పటిసి స్ధానాలకి ఎన్నికల నోటిఫికేషన్*
*వైఎస్సార్ కడప జిల్లాలో 50 జెడ్పిటిసి స్ధానాలకి 38, చిత్తూరులో 65 స్ధానాలకి 30, కర్నూలు జిల్లాలో 53 స్ధానాలకి 16, ప్రకాశంలో 56 స్ధానాలకి 14 జెడ్పిటిసి స్ధానాలు, నెల్లూరులో 46 కి 12, గుంటూరులో 57 కి 8 స్ధానాలు, కృష్ణాలో 49 కి రెండు స్ధానాలు, పశ్చిమగోదావరి 48 కి రెండు స్ధానాలు, విజయనగరంలో 34 స్ధానాలకి మూడు, విశాఖలో 39 కి ఒక జెడ్పిటిసి వైఎస్సార్ సిపి ఏకగ్రీవం*
**అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిలో ఏకగ్రీవాలు నిల్*
*హైకోర్టు ఆదేశాలతో ఏకగ్రీవాలైన 126 మంది జెడ్పిటిసిలను అధికారికంగా ప్రకటించి మిగిలిన 513 జెడ్పిటిసి స్ధానాలకి ఎన్నికలు*
*జెడ్పిటిసి ఎన్నికల బరిలో 2092 మంది అభ్యర్ధులు*
*రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంపిటిసిల సంఖ్య - 9984*
*కోర్టు,ఇతరత్రా కారణాలతో ఆగిన ఎంపిటిసిలు- 288*
*గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన ఎంపిటిసిల సంఖ్య - 9696*
*ఏకగ్రీవాలైన ఎంపిటిసిలు- 2371...ఇందులో వైఎస్సార్ సిపి 2209, టిడిపి-101, జనసేన-4, ఇతరులు-67*
*అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 433,వైఎస్సార్ కడప జిల్లాలో 432, ప్రకాశంలో 348, కర్నూలులో 312 ఎంపిటిసిలు ఏకగ్రీవం*
*91 చోట్ల అభ్యర్ధుల మృతితో మిగిలిన 7230 ఎంపిటిసిలకి జరగనున్న ఎన్నికలు*
*ఎంపిటిసిల బరిలో 19002 మంది అభ్యర్ధులు*
*ఓటర్ల సంఖ్య 2,82,15,104*
*పోలింగ్ బూత్ ల సంఖ్య- 33663*
*అతి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు- 11251*
*ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంధి 2,01,978*

Comments
Post a Comment