రఘూరామకృష్ణంరాజు పై సీబీఐ F.I.R
రఘురామకృష్ణంరాజు పై సీబీఐ FIR
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎస్బీఐ చెన్నై బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. ఇంద్ భారత్ పవర్ ప్రాజెక్ట్ కోసం రఘురామకృష్ణంరాజు 273.84 కోట్లు రుణం తీసుకుని ఎగవేశారని ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేసి నిధులను దారి మళ్లించినట్టు మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 23న సీబీఐకి ఫిర్యాదు చేశారు. బుశారం రఘురామకృష్ణరాజు సహా మరో 9 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Comments
Post a Comment